*శెట్టిపల్లి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి*

* తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు శెట్టిపల్లి పరిధిలోని భూములను మరియు అభివృద్ధి పనులకు ప్రతిపాదించిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా,తిరుపతి పరిసర ప్రాంతాలను మోడల్ కాలనీలు గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
* శెట్టిపల్లి ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ, విశాలమైన రహదారులు మరియు పచ్చదనానికి పెద్దపీట వేస్తాం అని తెలిపారు.
* ఇక్కడ నివసించే ప్రజలకు మెరుగైన ప్రమాణాలు కల్పించేందుకు తుడా నిరంతరం కృషి చేస్తుంది.
* శెట్టిపల్లి ప్రాంతం అభివృద్ధి అత్యంత కీలకమని, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు.
* భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం,నీటి సరఫరా,సుందరీకరణ,విద్యుత్ సరఫరా,పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తుడా ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.
* ప్రభుత్వ మరియు తుడా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనధికారిక లేఅవుట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
* అంతకముందు అక్కడికి చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని శెట్టిపల్లి రైతులు,నాయకులు సత్కరించారు.
* ఈ కార్యక్రమంలో తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి తుడా అధికారులు,సర్వేయర్లు,ఇంజనీర్లు మరియు రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
