*ఏపీలో ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?*
అమరావతి :

ఏపీలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చలు జరిపింది. ప్రస్తుతం 62 ఏళ్లు పైబడి కొనసాగుతున్న 2,831 మంది ఉద్యోగుల వివరాలపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ సమీక్షించారు. వయోపరిమితి పెంపు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారంపై సమగ్ర నివేదిక కోరారు. ఆ వివరాలు అందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేందుకు మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది.
