టిడిపి జిల్లా కార్యదర్శి
జె డబ్ల్యూ విజయ్ కుమార్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలి…

ఆయన ను సన్మానించిన బలిజభవన్ డెవలప్ మెంట్ సొసైటీ నేతలు
తిరుపతి, జనవరి 5:
టిడిపి తిరుపతి పార్లమెంట్ జిల్లా కార్యదర్శిగా నియమించబడిన టిడిపి నగర మాజీ అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు ఆకాంక్షించారు. సోమవారం
నగరంలోని ప్రైవేట్ హోటల్ లో బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమింపబడిన
జే డబ్ల్యు విజయ్ కుమార్ ను
సభ్యులు ఘనంగా శాలువాలతో సత్కరించారు. సందర్భంగా బి బి డి ఎస్ సభ్యులు మాట్లాడుతూ జెడబ్ల్యు విజయ్ కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి వార్డ్ కౌన్సిలర్,నగర అధ్యక్షులుగా రెండుసార్లు పనిచేశారని, ప్రజలకు చేసిన సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సెక్రటరీగా నియమించడం హర్షదాయకమని, ఆయన మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ,కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బలిజ భవన డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు,జనరల్ బాడీ సభ్యులు
బలిజ భవన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు,ఆత్రాజీ శేఖర్, చిన్నా రాయల్, దేపూరు భాస్కర్, టీ మురళి, గుట్ట నాగరాజు రాయల్, ముక్కు సత్తివంతుడు, చక్రి రాయల్,జెకె రాయల్,ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సన్మానించారు.
