Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా…*

*➡️“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి*

 

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు*

 

➡️ వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 81 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ గారు, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు.

 

*ఎస్పీ గారు పేర్కొన్న ముఖ్య అంశాలు :-*

 

* పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.

* ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం.*

 

🔰 ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. వాటిపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్.పి గారు నేరుగా మాట్లాడి సమస్యను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.

 

👉 ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, మహిళా పి.ఎస్ డి.ఎస్.పి శ్రీ బాలస్వామి రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

 

 

జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.

Related posts

కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీవారు

Garuda Telugu News

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

Garuda Telugu News

సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా పద్మనాభరాజు నియామకం.

Garuda Telugu News

Leave a Comment