*కోట మండలం తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి నియామకం*

కోట మండల తాత్కాలిక ఎంపీపీగా గూడలి బిట్టు 1
ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేమారెడ్డి సౌజన్య రెడ్డి ని తాత్కాలిక ఎంపీపీగా నియమిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ సుభాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేశారు. కోట మండలం ఊనుగుంట పాలెం కు చెందిన దాసరి అంజమ్మ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిసెంబర్ నెల 16వ ఆకస్మికంగా మరణించారు. ఈ క్రమంలో తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి పని చేయనున్నారు.
