Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పదునైన ముళ్ల కంచెతో పడక.. దానిపై నాట్యం చేస్తూ.. వినూత్న ఆచారం..

*పదునైన ముళ్ల కంచెతో పడక.. దానిపై నాట్యం చేస్తూ.. వినూత్న ఆచారం..*

ఇప్పుడు మీకు విభిన్న ఆచారం ఉన్న ఓ టెంపుల్ గురించి తెలియజేయబోతున్నాం. తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని గ్రామంలో పూంగావనం ముత్తుమారియమ్మన్ ఆలయం ఉందిఈ ఆలయానికి 63 ఏళ్ల నాగరాణి అమ్మవారు నిర్వాహకురాలిగా ఉన్నారు. ప్రతి మండల పూజ సమయంలో 48 రోజులు ఉపవాసం పాటిస్తూ ప్రజలకు దైవ వాక్కు చెప్పడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఏడు అడుగుల ఎత్తులో ఉడై ముళ్లు, కరువేలు చెట్టు ముళ్లు వంటి వాటితో ముళ్ల పడకను సిద్ధం చేశారు. నాగరాణి అమ్మవారు ఆ ముళ్ల పడకపై ఎక్కి కూర్చుని, నిలబడి, నాట్యం చేస్తూ భక్తులకు ఆశీర్వాదాలు ఇవ్వడం ఆమెకు అలవాటు.

 

ఈ సంవత్సరం 49వ మండల పూజా ఉత్సవంలో భాగంగా అమ్మవారికి శంఖాభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారికి దీపారాధన నిర్వహించారు. దీనిని కొనసాగిస్తూ, మధ్యాహ్నం నాగరాణి అమ్మవారు ముళ్ల పడకపై కూర్చుని ఆశీర్వాదాలు అందించేందుకు ఆలయం ముందు ఉన్న మైదానంలో ఉడై ముళ్లు, ఇలంతై ముళ్లు, కత్తాళి ముళ్లు వంటి వివిధ రకాల ముళ్లతో 7 అడుగుల ఎత్తులో ముళ్ల పడకను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులు మేళతాళాలతో వేడుకని ప్రారభించారు.దీనిని అనుసరించి నాగరాణి అమ్మవారు ముళ్ల పడకపై కూర్చుని, నిలబడి, పడుకుని, నాట్యం చేస్తూ ఆగ్రహంగా భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ వారికీ దైవ వాక్కు చెప్పింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు భారీగా పాల్గొన్నారు.

Related posts

జైలు నుంచే చదువు.. ఖైదీకి గోల్డ్ మెడల్

Garuda Telugu News

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు నామినేషన్ దాఖలు

Garuda Telugu News

కారవాన్ ఎక్కేయ్.. ఆంధ్రాను చుట్టేయ్!

Garuda Telugu News

Leave a Comment