తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
– చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన బాలుడు గుర్తింపు

– జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న చైల్డ్ ట్యాగ్ భద్రతా చర్యల్లో భాగంగా, ఈ రోజు తిరుమల దర్శనార్థం వచ్చిన వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్రం సింగ్ గారి కుమారుడు సౌభాగ్య సింగ్ (Saubhagya Singh), వయస్సు 7 సంవత్సరాలు, గుర్తించడం జరిగింది.
– తిరుమలలోని పాచి కాలువ గేట్ సమీపంలో బాలుడు తన తల్లిదండ్రుల నుండి దారి తప్పాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించగా, అప్రమత్తమైన పోలీసులు చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా బాలుడి వివరాలను గుర్తించారు.
– తదనంతరం అదనపు ఎస్పీ శ్రీ శ్రీనివాసులు గారి సమక్షంలో, బాలుడిని సురక్షితంగా అతని తల్లిదండ్రులకు కమాడ్ కంట్రోల్లో అప్పగించడం జరిగింది.
– ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తరఫున, తిరుమలకు వచ్చే భక్తులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని చైల్డ్ ట్యాగ్ విధానాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.
