Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

*తిరుపతి, తేదీ: 31.12.2024*

*జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పాటు జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్, గారు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని, సంబంధిత మీడియా యాజమాన్యం వారు వారి సంస్థలో పని చేయుచున్న జర్నలిస్టుల వివరాలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, తిరుపతి వారి కార్యాలయంలో వీలైనంత తొందరగా అందచేయాలని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు.
—————————————-
*డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

Related posts

ఒక్క హెల్మెట్, వంద ప్రమాదాల నివారణ!

Garuda Telugu News

హెల్మెట్ ధారణ మరియు ఇతర రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

Garuda Telugu News

విద్యుదాఘాతంతో పాడి పశువులు మృతి

Garuda Telugu News

Leave a Comment