భగవద్గీతను పాఠ్యాంశంగా పిల్లలకు ప్రవేశపెట్టాలి
మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి

శ్రీకాళహస్తి
భగవద్గీతను పాఠ్యాంశంగా విద్యార్థులకు ప్రవేశపెట్టాలని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు ఆదివారం ప్రతి ఒక్కరు సరళంగా తెలుగులో చదివే విధంగా భగవద్గీతను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు ప్రతి ఒక్కరు భగవద్గీత పఠణం చేయాలని తెలిపారు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా ఈ భవద్గీతను ఇస్తానన్నారు భగవద్గీత చదివిన విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి విలువలు నైతికతను యువతకు బోధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను అన్నారు భవద్గీత బోధనలో విద్యార్థుల వ్యక్తిగత వికాసానికి ధర్మబద్ధమైన జీవితానికి దోహదపడుతుందన్నారు ప్రతి ఒక్కర విద్యార్థి భగవద్గీతపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు భగవద్గీతను తీసుకున్న విద్యార్థులకు త్వరలో భగవద్గీత పై వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు
