శీతాకాల పార్లమెంటు సమావేశాలకు 94 శాతం హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

*ఏడు డిబేట్స్లో పాల్గొని,122 ప్రశ్నలకు, సమాధానాలను రాబట్టిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన చిత్తూరు ఎంపీ*
*ప్రసాదరావు కృషిని కొనియాడుతున్న చిత్తూరు పార్లమెంటు ప్రజలు*
—————————-
చిత్తూరు
—————————-
న్యూఢిల్లీలో మొన్న జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు 94 శాతం హాజరైయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసారు.
ఏడు డిబేట్స్లో పాల్గొని,122 ప్రశ్నలకు, సమాధానాలను రాబట్టారు. ముఖ్యంగా హెల్త్ సెక్యూరిటీ, సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025, రైల్వే శాఖ కింద గ్రాంట్ నెంబర్ 80కి డిమాండ్, కేంద్ర బడ్జెట్ 2025- 26, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024 పై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొని , ఆయా శాఖలకు సంబంధించిన మంత్రుల నుంచి సమాధానాలతో పాటు ఫలితాలను రాబట్టారు చిత్తూరు పార్లమెంటు సభ్యు
