*గంగాప్రసాద్ సోదరుడు సత్యనారాయణ మృతికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*

ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కే గంగా ప్రసాద్ సోదరుడు కె.సత్యనారాయణ చౌదరి శనివారం ఉదయం 11 గంటలకు మరణించారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హుటాహుటిన సూళ్లూరుపేట చేరుకొని మృతులు సత్యనారాయణ చౌదరి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
అనంతరం పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్ కు తన ప్రగాఢ సంతాపాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఏంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి, ఎస్ఎం సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
