*టీవీకే చీఫ్ విజయ్కు సీబీఐ సమన్లు*

చెన్నై: కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈనెల 12న దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన విజయ్ ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు.
