Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అస్వస్థత తో మరోసారి ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ!

*అస్వస్థత తో మరోసారి ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ!*

హైదరాబాద్:జనవరి 06

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యంతో దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, ఛాతీ వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్నట్లు వెల్లడించాయి.

 

సాధారణ చెకప్ కోసం ముఖ్యంగా దిల్లీలో కాలుష్యం కారణంగా దగ్గుతో ఆస్పత్రిలో చేరినట్లు వివరించాయి.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం రాత్రి 10 గంటలకు దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.

 

ఆమె శ్వాస సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రి కి రావడంతో వెంటనే పరీక్షలు చేశాం. చల్లటి వాతావరణంతో పాటు వాయు కాలుష్యం వల్ల ఆమెకు బ్రాంకైల్ ఆస్తమా వచ్చింది. ముందు జాగ్రత్తగా ఆమెను ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

 

యాంటీ బయాటిక్తో పాటు ఇతర మందులకు ఆమె మంచిగా సహకరిస్తు న్నారు. ఆమెను డిఛార్జ్ చేసే విషయాన్ని వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సుమారు ఒకటి లేదా రెండు రోజుల్లో సోనియా గాంధీ డిఛార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Related posts

మహా వైభవంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి కొలువు

Garuda Telugu News

ఆల్ ఇండియా సీనియర్ మహిళా టి20 టోర్నమెంట్లో మంగళగిరి అమ్మాయి…

Garuda Telugu News

_భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్* కార్యక్రమానికి మైదుకూరు రెవిన్యూ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్

Garuda Telugu News

Leave a Comment