టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ను కలసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్

తిరుపతి నవంబర్ 6 :
తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ ని మంగళవారం శ్రీ తాతయ్యగుంట ఆలయంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్ రాయల్, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిసి
శాలువలతో సన్మానించారు. అనంతరం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దర్శనానికి బయలుదేరు వెళ్లారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్
కలసిన వారిలో కార్పొరేటర్ అన్నా అనిత, తెలుగు యువత నేతలు రంజిత్ నాయుడు, హర్ష కూడా ఉన్నారు.
