*కారవాన్ ఎక్కేయ్.. ఆంధ్రాను చుట్టేయ్!*
అమరావతి :

ఏపీ రాష్ట్రంలో పర్యాటకుల కోసం సరికొత్త కారవాన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీటీడీసీ పోర్టల్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండు సంస్థలు, నాలుగు మార్గాల్లో 10-12, 5-6 సీట్ల సామర్థ్యం గల వాహనాలను నడుపుతున్నాయి. వీటిలో టీవీ, ఫ్రిజ్, వాష్రూం వంటి సదుపాయాలు ఉన్నాయి. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు 6 రోజుల ప్యాకేజీని రూ.3.50 లక్షలకు అందిస్తున్నారు.
