Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఉపాది హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి..

*ఉపాది హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి..*

నాగలాపురం: గతంలో ఉన్న విదంగానే ఉపాది హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంగా కొనసాగింపు చేయాలని నూతనంగా వికసిత్ భారత్ జీరాంజీ పేరును మార్పు చేయడం సరికాదని రైతు సంఘ అధ్యక్షులు చిన్నదొరై అన్నారు.

ఈ మేరకు సోమవారం స్థానిక మేజర్ పంచాయతి కార్యాలయ ఆవరణలో సర్పంచ్ చిన్నదొరై సుధా ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు డ్వామా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నదొరై మాట్లాడుతూ ఉపాది హామీ పథకం ప్రారంభమే మహాత్మా గాంధీ పేరిట ఆ పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

అలాగే 125 రోజులు పని దినాలు పెంపొందింనప్పట్కి సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పథకం ద్వారా అనేక మంది నిరుపేద కూలీలు రోజువారి జీవనం సాగిస్తున్నారని.

అంతటి గొప్ప కార్యక్రమం పై రాజకీయం చేయడం సరికాదని ఆయన హితువు పలికారు.

ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ సునీత, ప్రజా ప్రతినిదులు, వార్డు మెంబర్లు, డెప్యుటీ ఎంపిడిఓ మునిరత్నం, పంచాయతి కార్యదర్శి రాధిక, జూనియర్ అసిస్టెంట్ వెంకటరామ రాజు, ప్రభాకర్, సచివాలయ సిబ్బందులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

తిరుమల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.

Garuda Telugu News

తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం

Garuda Telugu News

ఇన్ని పన్నులు చెల్లిస్తున్నా… ఇంకా ఇన్ కం ట్యాక్స్ కట్టాలా…

Garuda Telugu News

Leave a Comment