*వచ్చే ఎన్నికల్లో ‘జాగృతి’ పోటీ చేస్తుంది: కవిత*

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని.. రాజకీయ శక్తిగా తిరిగివస్తానని వ్యాఖ్యానించారు. అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నానని.. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
