
నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమీక్షలో సంస్కరణల అంబాసిడర్లుగా వారు పనిచేయాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
