Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

డీకేటి పట్టాలు ఇంటి పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ గారికి వినతిపత్రం…..

*డీకేటి పట్టాలు ఇంటి పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ గారికి వినతిపత్రం…..*

వడమాల పేట తాసిల్దార్ గారికి 05/01/2026 వ తేదీన జరీనా గారికి వినతి పత్రం ఇవ్వడం అయినది. ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై నందయ్య మాట్లాడుతూ మండలంలో అనుభవంలో ఉన్న భూములకు డీకేటి పట్టాలు ఇవ్వాలని ఒకే కుటుంబంలో రెండు మూడు కాపురాలు కలిగి ఉన్నాయి. వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని,ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా భూములకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని వడమాల పేట టీజి ఆర్ఎస్ లో వినతి పత్రం ఇవ్వడం అయినది. స్పందించిన తాసిల్దార్ గారు భూములను సర్వే చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇస్తామని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో స్మశానం ఏర్పాటు చేసి దారి సౌకర్యం కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మికుల సంఘం కార్యదర్శి ఈ.శ్రీనివాసులు,కె.మణి,టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.

Garuda Telugu News

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తాం

Garuda Telugu News

Leave a Comment