*ప్రచరణార్థం*

సిఐటియు జాతీయ కౌన్సిలకు కందారపు మురళి ఎన్నిక….
శుభాకాంక్షలు తెలియజేసిన సీఐటీ జిల్లా కమిటీ…..
విశాఖ పట్నం లో డిసెంబర్ 31తేదీ ,2025నుండి జనవరి 4వ తేదీ 2026 వరకు జరిగిన సిఐటియు 18 వ అఖిలభారత మహాసభలో తిరుపతి జిల్లా నుండి జాతీయ కౌన్సిల్ కు ఎన్నికైన కందారపు మురళి గారికి తిరుపతి జిల్లా అధ్యక్ష,కార్యదర్శి ఎస్.జయచంద్ర,టి.సుబ్రమణ్యం అభినందనలు ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి జిల్లా నుండి జాతీయ మహాసభలకు కందారపు మురళి,ఎస్.జయచంద్ర,టి .సుబ్రమణ్యం,ఆర్.లక్ష్మీ,ఎస్. వాణిశ్రీ ప్రతినిధులుగా హాజరయ్యారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యల పైన అనేక తీర్మానాలు చేయడం జరిగింది.
ఫిబ్రవరి 12వ తేదీ లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు 18 వ అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది.
*నమస్కారములతో..*
*ఎస్.జయచంద్ర*
*జిల్లా అద్యక్షుడు*
*టి.సుబ్రమణ్యం*
*జిల్లా ప్రధాన కార్యదర్శి*
