మా ప్రాణాలకు రక్షణ ఏది-కౌన్సిలర్ నాగార్జున

నాయుడుపేట పట్టణం 2వ వార్డులోని NSR కాలనీ వద్ద రైల్వే గేట్ దాటుతూ ఒకరు మరణించారు…ఈరోజు కౌన్సిలర్ నాగార్జున కాలనీవాసులతో కలిసి కాలనీ వద్ద ఉన్న రైల్వే గేటు ను సందర్శించారు..అక్కడ రైల్వే అండర్ పాస్ కోసం కౌన్సిలర్ నాగార్జున తో పాటు గ్రామస్తులు పలుమార్లు అధికారులకు నాయకులకు వినతి పత్రాలు సమర్పించారు…అయినా అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు కాలేదు..నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ఎమ్యెల్యే సంజీవయ్య రైల్వే అధికారులతో మాట్లాడి గేటు మూసివేయకుండా నిలిపామన్నారు.కానీ ఇటీవల గేటు మూసివేయడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున రైల్వే అధికారులు తొందరగా అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేసి మా కాలనీ వాసుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కౌన్సిలర్ నాగార్జున ఆవేదన వెలిబుచ్చారు
