
04-01-2025.
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ .
*తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవం కాదు .
• తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్దం .
• అందులో ఎలాంటి వాస్తవం లేదు .
* తెలంగాణా లో తమ రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే శ్రీ రేవంత్ రెడ్డి గారు అలా మాటలాడి యుండచ్చు .
• జగన్ హమాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టను చేపట్టిన నాటి ప్రభుత్వం.
• సీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా పనులు చేపట్టిన జగన్.
• నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పనులు పై కోర్టులో , NGT లో కేసులు వేసింది నాటి తెలంగాణ ప్రభుత్వం.
• కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటి సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు.
• తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించిన NGT అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేతకు ఆదేశాలు తో స్టే ఇవ్వడం జరిగింది .
* 2020లోనే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన ఎన్టీటి, కేంద్ర ప్రభుత్వం.
• 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు నిలిపివేసిన కేంద్రం.
• చంద్రబాబు సెంట్రిక్ గా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్న ఆ రాష్ట్రంలోని అధికార, విపక్షాలు.
• ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కు ఏ మాత్రం రాజీ ఉండదు .
• రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలు బయటపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.
• రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిచిపోవడానికి కారణమైన శ్రీ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఇప్పుడు తమ రాజకీయ లబ్ధికోసం వాడుకొంటూ శ్రీ రేవంత్ రెడ్డి కోరడంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపి వేసి రాయలసీమ కు ద్రోహం చేసారు అనే విధంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు దిగారు వైకాపా నాయకులు .
• అసలు రాయల సీమ ప్రాజెక్టులను ముంచేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి నే .
• 2014-19 మధ్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులు కోసం రూ . 12,441 కోట్లు ఖర్చు చేస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి తన అయిదు ఏళ్ళ పాలనలో సీమ ప్రాజెక్టులు కోసం కేటాయించింది కేవలం రూ . 2011 కోట్లు మాత్రమే .
• 102 ప్రాజెక్టులు పనులు నిలిపి వేశారు .
• రాయల సీమకు తీరని ద్రోహం జరిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే .
• ఇప్పుడు మాత్రం వైకాపా నాయకులు డ్రామాలు ఆడుతున్నారు .
• సీమ ప్రజలు అమాయకులు కారు వైకాపా వారి మాటలు నమ్మడానికి .
