ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఆర్థికంగా యాదవ కుటుంబాలకు అండగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన,

తిరుమల ఆలయం లో స్వామివారి తలపులు తెరిచే ప్రధాన సన్నిధి గొల్ల 1 మరియు సన్నిధి గొల్లలు గా 2
మెత్తం ముగ్గురికి అవకాశం కల్పించి
TTD బోర్డు లో తీర్మానం చేయించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు
….జి నరసింహ యాదవ్ రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్
తిరుమలలో శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రన్న ను కోరడం జరిగింది – నరసింహ యాదవ్*
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలలో యాదవ కులానికి చెందిన శరభయ్య యాదవ్ విగ్రహాన్ని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగిందని రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్
జి నరసింహ యాదవ్ తెలిపారు . ఆదివారం పుట్టపర్తి సాయి ఆరంభంలో జరిగిన యాదవ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలలో యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో యాదవులకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి యాదవ భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. విశాఖపట్నంలో యాదవ భవనానికి ప్రభుత్వం 50 సెంట్లు స్థలం కేటాయించిందన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం యాదవ కుటుంబాలకు అనేక పథకం అమలు చేయబోతుందన్నారు. యాదవులను చదువుకుంటున్న విద్యార్థులతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.
*:- యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి – రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్*
*:- యాదవులు రాజకీయంగా రాణించాలి – మాజీ ఎమ్మెల్సీ గుండుమల*
పుట్టపర్తి టౌన్ డిసెంబర్ 28 ప్రభాత వార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభాలో దాదాపు 25 శాతం కలిగిన యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సమిశిత స్థానం కల్పించాలని రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు లాగా వెంకటరావు యాదవ్ అన్నా రామచంద్రయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలోని సాయి ఆరామం లో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలభారత యాదవ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ పాల్గొన్నారు
