కుప్పం గ్రామసభలలో పాసుపుస్తకాల పంపిణీ

జనవరి 3 కుప్పం మండలంలో రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రలతో కూడిన 5500 పాసు పుస్తకాలు రెవిన్యూ కార్యాలయానికి చేరిందని కుప్పం తహసిల్దారు చిట్టిబాబు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఈనెల 8వ తేదీ వరకు గ్రామసభ నిర్వహించి పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పాసు పుస్తకాలు అందని రైతులు తహసిల్దారు కార్యాలయాన్ని సంప్రదించి రైతుల వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం పాసు పుస్తకాల అందని రైతుల రికార్డులను పరిశీలించి పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.
