*_గ్రామ పంచాయతీ భవన నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కూరపాటి శంకర్ రెడ్డి_*

*_(చిలమత్తూరు పంచాయతీ)_*
* _తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు పంచాయతీలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి విచ్చేసిన కూరపాటి శంకర్ రెడ్డి గారికి బత్తలవల్లం చెక్ పోస్ట్ వద్ద మండల అధ్యక్షులు యుగంధర్ రెడ్డి, ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జిలు నిర్మల్, నాగరాజు,నిరంజన్ రెడ్డి,ఎల్లా రఘ,అయ్యప్ప రెడ్డి,ఉమా మహేశ్వరి,సత్యవేడు సుబ్బు,రమేష్ మురుగేష్,తడ దిలీప్, సురేష్,జయరామయ్య, రవి,మరియు టీడీపీ మండల నాయకులు అందరూ పూలమాలలు వేసి శాలువాతో సత్కారించి బాణాసంచా కాలుస్తూ పూలవర్షాల నడుమ ఆయనకు గణ స్వాగతం పలికారు.
* _ఈ నూతన భవన నిర్మాణకార్యక్రమం శుక్రవారం నాడు వరదయ్యపాలెం టీడీపీ మండల అధ్యక్షులు P. యుగంధర్ రెడ్డి,టీడీపీ సీనియర్ నాయకులు M.కృష్ణమూర్తి రెడ్డి,రామలింగారెడ్డి,చిలమత్తూరు (సర్పంచ్)శ్రీమతి ఎల్లా కిషోర్ అధ్యక్షతన ముఖ్య అతిధిగా విచ్చేసిన సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి,పురోహితుల వేదమంత్రాల నడుమ భూమి పూజ కార్యక్రమనికి ఎంతో ఘనంగా శంకుస్థాపన చేశారు.
*_ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
