*రేపటి నుండి రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

✍️ *పాల్గొననున్న ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు*
✍️ *ఈ నెల 02వ తేదీన నారాయణవనం తహశీల్దారు కార్యాలయంలో..*
✍️ *03వ తేదీన పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టులో..*
✍️ *05వ తేదీన నాగలాపురం మండలం లోని కాలంజేరి లో..*
రేపటి నుండి అనగా శుక్రవారం నుండి రైతులకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా జరగనుంది.
*ఈ మేరకు ఈ నెల 02వ తేదీన* శుక్రవారం నారాయణవనం తహశీల్దారు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతుల మీదుగా అన్నదాతలకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారు.
*03వ తేదీన శనివారం* ఉదయం 10 గంటలకు పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టులో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారు అందజేస్తారు.
*అలాగే 05వ తేదీన సోమవారం* ఉదయం 10 గంటలకు నాగలాపురం మండలం లోని కాలంజేరి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారు రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారు.
పై కార్యక్రమాలకు అన్నీ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
——————————————–
*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*
——————————————–
