కౌషల్ ప్రతిభన్వేషణ క్విజ్ పోటీల్లో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థి వరుణ్ రెడ్డి.

…….కౌషల్ ప్రతిభన్వేషణ జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో తిరుపతి జిల్లా వరదయ్యపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థి వరుణ్ రెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు.వారం క్రితం 2025 కౌషల్ ప్రతిభన్వేషణ పోటీలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో వరదయ్యపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న వరుణ్ రెడ్డి క్విజ్ పోటీ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించారు.ఈ క్రమంలో తిరుపతిలో మంగళవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ చేతుల మీదుగా విద్యార్థి వరుణ్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థి వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా బుధవారం వరదయ్యపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం రమణయ్య ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.ఈ పోటీల్లో గైడ్ మాస్టర్గా సుబ్బరామయ్య వ్యవహరించారు.
❄కాగా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థి వరుణ్ రెడ్డి ఈనెల 27వ తేదీన తిరుపతి సంస్కృత
