Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

శ్రీవారి సేవ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు

 

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి

 

తిరుమల, 02 డిసెంబర్ 2025: రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి సేవ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అన్నారు.

 

మంగళవారం తిరుమలలోని సేవా సదన్–2లో గ్రూప్ సూపర్వైజర్ల (మాస్టర్ ట్రైనర్లు)లకు నిర్వహించిన తొలి బ్యాచ్ ‘ట్రెయిన్ ద ట్రైనీస్‘ శిక్షణా కార్యక్ర‌మానికి ఆయన విచ్చేశారు.

 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ‌కులు హిందూ ధ‌ర్మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లు అని చెప్పారు. దేశ‌విదేశాల నుండి తిరుమ‌ల‌కు విచ్చేస్తున్న భ‌క్తుల‌కు సేవ చేయ‌డంలో శ్రీ‌వారి సేవ‌కుల పాత్ర అత్యంత కీల‌క‌మైన‌ది తెలిపారు.

 

ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ద్వారా త‌మ త‌మ ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లు శిక్ష‌ణ ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం–అహ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూల్‌లను రూపొందించిన‌ట్లు చెప్పారు.

 

ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్, భక్తులతో న‌డ‌వ‌డిక‌, నాయకత్వ లక్షణాలు, టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారు. దీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

 

ఈ శిక్షణ పొందిన గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లు త‌మ ప్రాంతాల్లో శ్రీ‌వారి సేవ‌కు న‌మోదు చేసుకున్న శ్రీ‌వారి సేవ‌కుల‌కు సేవకు రాకమునుపే శిక్షణ అందించి వారిని భ‌క్తుల‌కు ఉన్న‌త‌మైన సేవ‌లు అందించే విధంగా తీర్చిదిద్ద‌డ‌మే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయ‌న తెలిపారు.

 

ఈ శిక్షణ తరగతుల సారాన్ని గ్రహించి, ఇతర సేవకులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దిద్దాలని గ్రూప్ సూపర్వైజర్లలకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో పండితులు డా. మేడసాని మోహన్, డా. దామోదర్ నాయుడు, డా. శ్రీనివాస్, టీటీడీ ఛీఫ్ వీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో (FAC) కుమారి నీలిమ, సేవా సదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Related posts

పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపియస్

Garuda Telugu News

స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మరియు ఇస్రో బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు

Garuda Telugu News

హత్యాయత్నం కేసులో తండ్రి కొడుకులకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 5000 రూపాయలు జరిమానా

Garuda Telugu News

Leave a Comment