Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారెతో కలిసి నివేదిక అందజేయడం జరిగింది

*ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారెతో కలిసి నివేదిక అందజేయడం జరిగింది.

*కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు , శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు పలువురు ఎంపీలు తో కలిసి రాష్ట్రంలో పంట నష్టం గురించి వివరించడం జరిగింది. 24 జిల్లాల్లోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాను ప్రభావంతో నష్టపోయాయని, సుమారు 1.61 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని, సుమారు 6,250 హెక్టార్లలో పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వివరించడం జరిగింది.*

*రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై కేంద్రం నుంచి సాయం అందించిరైతులను ఆదుకోవాలని విన్నవించడం జరిగింది.*

Related posts

నీట మునిగిన వరి పంట లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైతులకు వివరించారు

Garuda Telugu News

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

హమాలీలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి  – సిఐటియు నాయకులు ఎన్ నాగరాజు డిమాండ్

Garuda Telugu News

Leave a Comment