*రూ.50 వేలుకు సరుకు కొని డబ్బులివ్వకుండా జంప్*

నాగలాపురం: యాబై వేల రూపాయలకు సరుకు కొని డబ్బులివ్వకుండా ఓ గుర్తు తెలియని వ్యక్తి పారిపోయిన
ఘటన నాగలాపురం మండలంలో శనివారం చోటు చేసుకుంది.
షాపు యాజమాని వివరాలిలా.. పట్టనంలోని స్థానిక వీ.కె.ఎం వీదిలో గల నీలకంటం ఎంటర్ప్రైసస్ (రాదేశ్యామ్) దుఖానంలో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి రూ.50 వేలుకు కరెంటు సామాగ్రీలు కొన్నాడు.
షాపు యాజమాని బిల్లు వేసిన తరువాత వినియోగదారుడు ఫోన్పే, గూగుల్ పే పని చేయలేదని చాలా సేపు ఉడాయించి. కొద్ది సేపు తరువాత షాపులో పనివాడిని తనతో పంపివ్వమని చెప్పి అతన్ని తన ద్విచక్ర వాహనంలో బైటకొడియంబేడు ఇండియన్ ఆయిల్ పీట్రోల్ బంక్ వరకు తీసుకెళ్ళి 5 నిమిషాలలో తమ ఓనర్ వద్ద డబ్బులు తీసుకొస్తానని చెప్పి పారిపోయాడు.
షాపులోని సీసీ పుటేజస్ ఆధారంగా షాపు యాజమాని స్థానిక పోలీసు స్టేషన్లో పిరుర్యాదు చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని స్థానికులు ఎవరైనా గుర్తించినట్లయితే స్థానిక పోలీసు స్టేషన్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సునీల్ కోరారు.
