Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విశాఖ, సిక్కోలు జిల్లాలు అతలాకుతలం

విశాఖ, సిక్కోలు జిల్లాలు అతలాకుతలం

— పెనుగాలుల బీభత్సానికి విరిగిన చెట్లు, స్తంభాలు..

— నలుగురి మృతి.. మృతుల్లో వృద్ధ దంపతులు

— కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తం

— ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి నదులు

— ‘హుద్‌హుద్‌’ గుర్తొచ్చి హడలెత్తిన విశాఖ వాసులు

— కొద్ది క్షణాలపాటు గంటకు 66 కి.మీ. వేగం

— నీట మునిగిన పంటలు.. పలు కాలనీలు

విశాఖపట్నం, శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో కుండపోత వానలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం కారణంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో గురువారం ఎడతెరిపిలేని వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈదురుగాలులకు విద్యుత్‌ తీగపడి విశాఖలో ఒకరు, గోడలు కూలి సిక్కోలు జిల్లాలో ఇద్దరు, మన్యం జిల్లాలో ఒకరు.. మొత్తం నలుగురు మృతి చెందారు. సిక్కోలు జిల్లాకు సంబంధించి.. ఎగువన ఒడిశాలోనూ భారీవర్షాలు కురవడంతో ఆ వరద కూడా జిల్లాను ముంచెత్తింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదీ పరీవాహక ప్రాంతాలను దాటి ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అతలాకుతలమయ్యారు. ముఖ్యంగా పాతపట్నం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. 17 మండలాల్లో 8,6

Related posts

సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం

Garuda Telugu News

రైలు కింద ప్రేమ జంట రొమాన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం

Garuda Telugu News

డిసెంబర్ నెలాఖరుకు అక్రిడిటేషన్స్ ఇవ్వకపోతే న్యాయపోరాటం 

Garuda Telugu News

Leave a Comment