తాగిన మత్తులో యువకుడు ఆగడం.
స్వర్ణముఖి నది బ్యారేజ్ లో దిగిన తాగుబోతు..
బయట కు తీసిపోలీస్ కౌన్సలింగ్.

మనుబోలు. 26.9.2025.(గరుడ దాత్రి ) తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు లోశుక్రవారంచిన్ని కృష్ణా అనే యువకుడు పీకల దాకా మద్యం సేవించి పోలీస్ లకు టెన్షన్ పుట్టించాడు. తాగిన మైకంలో స్వర్ణ ముఖి నది బ్యారేజ్ లో దిగి పలువురిని ఇబ్బంది పెట్టాడు. పోలీసులు రంగంలోకి దిగి బ్యారేజీ కాలువ వద్ద ఆగిత్తం చేసిన యవకుడిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. గతంలో ఇదే వ్యక్తి రెండుసార్లు పీకలదాకా మద్యం సేవించి సెల్ టవర్ ఎక్కి రసాభాస సృష్టించాడు. తాగినప్పుడల్లా ఈ యువకుడు ఇలాగేనే ప్రవర్తించడం గ్రామస్తులు అతని ధోరణి పట్ల మండిపడుతున్నారు. మళ్లీ ఇంకెప్పుడైనా ఇలా ప్రవర్తిస్తే పట్టించుకోమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి యువకుడ్ని ఇంటికి సాగనంపారు.
