Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమల టీటీడీ గోశాల గోవుల మృతి ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన

*తిరుమల టీటీడీ గోశాల గోవుల మృతి ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన*

 

గత మూడు మాసాలలో టీటీడీ గోశాలలో సుమారు 100 గోవుల మృతి చెందిన విషయంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. హిందువులు గోవులను తల్లిగా భావించి ‘గోమాత’ అని పిలుస్తారు. అలాంటి గోవులు ఇలాంటి దయనీయ స్థితిలో ఉండటం ఎంతో క్షోభను కలిగిస్తోందని తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తూ, ఈ చర్యలను ఖండించారు. ఈ ఘటనతో టి.టి.డి గోశాల నిర్వహణ ఎలా ఉంధో నిరూపితమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా నోరులేని గోవులకు కూడా ఇలాంటి దుస్థితి పట్టిందన్నారు. తక్షణమే గోవుల మరణంపై లోతైన విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. గోశాలలోని గోవుల పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం సహించరానిదని ఎంపీ స్పష్టం చేశారు.

Related posts

ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ లో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి

Garuda Telugu News

చివరి వినియోగదారుని వరకు జిఎస్టీ ఫలాలు అందాలి

Garuda Telugu News

వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా..”

Garuda Telugu News

Leave a Comment