Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

*టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*

పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మనోహర్ బుధవారం సాయంత్రం మరణించారు.

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం అడవికొడియంబేడు లోని మనోహర్ స్వగృహానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనోహర్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు చిరస్మణీయం అన్నారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించి, తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పద్దు రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండండి

Garuda Telugu News

భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం 

Garuda Telugu News

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి ఇచ్చాం….

Garuda Telugu News

Leave a Comment