Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు

* ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్టీలో ఉంటూ తెరచాటు రాజకీయాలు నడుపుతున్న వారికి ముగింపు పలకాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం.. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది.

 

సోమవారం(ఫిబ్రవరి 03) ఏపీలో వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు నందిగామ, హిందూపురం, పాలకొండ మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాళెం, నూజివీడు, తుని, పిడుగు మున్సిపాలిటీలకు వైస్ ఛైర్ పర్సన్స్ ఎన్నిక నిర్వహించనున్నారు.

 

ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలోనే విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేయనుంది.

Related posts

ఈ ప్రభుత్వం రెండు నెలల్లో లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చని, ఆ తర్వాత మీ కథ ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు

Garuda Telugu News

బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి

Garuda Telugu News

వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించిన…

Garuda Telugu News

Leave a Comment