
*చిత్తూరు గంగా సాగరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం*…
*స్పందించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ*
*మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు*…
*క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులకు సూచించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు*..
చిత్తూరు
చిత్తూరు సమీపంలోని గంగా సాగర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన పై.., తక్షణం స్పందించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే సమయంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది మృత్యువాత పడడం, 22 మంది గాయాల పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు…,
చిత్తూరు పార్లమెంటు పరిధిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు తామంతా బాసటగా నిలుద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు.
