Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు గంగా సాగరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం

 

 

*చిత్తూరు గంగా సాగరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం*…

*స్పందించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ*

*మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు*…

*క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులకు సూచించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు*..

చిత్తూరు

చిత్తూరు సమీపంలోని గంగా సాగర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన పై.., తక్షణం స్పందించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే సమయంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది మృత్యువాత పడడం, 22 మంది గాయాల పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు…,

చిత్తూరు పార్లమెంటు పరిధిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు తామంతా బాసటగా నిలుద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు.

Related posts

జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Garuda Telugu News

రైలు కింద ప్రేమ జంట రొమాన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం

Garuda Telugu News

ఓ పక్క నిర్మాణం..

Garuda Telugu News

Leave a Comment