*30.3 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం*

✍️ *ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు*
✍️ *సాయంత్రం 6 గంటలకు అరణియార్ గేట్లు ఎత్తివేత*
పిచ్చాటూరు అరణియార్ నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 30.3 అడుగులకు చేరుకుంది.
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు కావడం తో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరిగేషన్ అధికారులు సాయంత్రం 6 గంటలకు ఒక గేటు ను పైకి ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని బయటకు పంపారు.
ప్రాజెక్టుకు వచ్చే నీటిని బట్టి గేట్లను ఆపరేట్ చేస్తామని ఇరిగేషన్ ఏఈ వెల్లడించారు.
ఈ క్రమంలో అరుణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
