Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బాపట్ల రైల్వే స్టేషన్‌‌లో 21 కేజీల గంజాయి పట్టివేత

*బాపట్ల రైల్వే స్టేషన్‌‌లో 21 కేజీల గంజాయి పట్టివేత*

బాపట్ల రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేసిన ఈగల్, ఆర్పీఎఫ్ సిబ్బంది

 

ఒడిశాకు చెందిన ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

ట్రైన్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు బాపట్ల రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. పూరి – తిరుపతి రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఈగల్‌, ఆర్‌పీఎఫ్ టీమ్‌లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21 కేజీల గంజాయి పట్టుబడింది.

 

ప్రాథమిక విచారణలో ప్రకాశ్‌ అనే వ్యక్తి ఒడిశాలోని బరంపూర్‌ నుంచి కేరళకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

 

రైల్వే స్టేషన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగిస్తామని, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈగల్‌ టీమ్‌ అధికారులు హెచ్చరించారు.

Related posts

తిరుమల శ్రీవారి రథసప్తమి సూర్య జయంతి) ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారులు మరియు టిటిడి అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్

Garuda Telugu News

విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్., గారు తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జయశ్యాం ధియేటర్ రోడ్ వద్ద అకస్మిక తనిఖీలు చేపట్టారు

Garuda Telugu News

నెల్లూరునగరంలో వైసీపీ జెండాను రెపరెపలాడించాలి

Garuda Telugu News

Leave a Comment