“దేవి శరన్నవరాత్రుల”ఆరవ రోజున శ్రీదుర్గా దేవి అలంకారములో శ్రీశక్తి చాముండేశ్వరీ దేవి. తిరుపతి రూరల్ మండలము తుమ్మలగుంట క్రాస్ రోడ్డు యల్ ఎస్ నగర్ కాలని వద్ద గల శ్రీశక్తి చాముండేశ్వరి దేవి దేవాలయములో ఈరోజు అనగా తేది:28/09/2025 ఆదివారము ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకము, అలంకారము, హోమం, మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము నిర్వహించడమైనది.ఈ యొక్క కార్యక్రమాలకు ఉభయదారులు,ధర్శన్ ఇన్ట్ర్నేషనల్ కంపెని ఉద్యోగస్థులు బి.లోకేష్ యాదవ్,వై.దిలీప్ కుమార్ ఆదర్యంలో కంపెని స్టాప్, వై.హేమాద్రి,రామకృష్ణమ నాయుడు, సునీత, టి.సుధాకర్, ఆర్.ఉషారాణి,రామమోహన్ సింగ్, డి.గీతా,జయపాల్ నాయుడు,నాగమణి,ఇ.అనిత,హేమగిరి, గారు దంపతులు, ఉభయదారులుగా కార్యక్రమములు నిర్వహించడమైనది.ఈకార్యక్రమమునకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమములో పాల్గొన్నారు.ఉభయ దారులకు ముఖ్య అతిథులకు ఆలయ దర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి దగ్గర ఉండి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకడమైనది. ఉభయ దారులకు,అతిథులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వారికి అమ్మ వారి తీర్థ ప్రసాదములు, అమ్మ వారి చీర,అమ్మవారి పోటోలు, బహుకరించి,ఘనంగా సత్కారములు చేయడమైనది.మరియు భక్తులకు ఏర్పాట్లు అన్ని ఆలయ ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి గారు దగ్గర ఉండి ఏర్పాట్లు చేయడమైనది.ఈ కార్యక్రములో ఆలయ ధర్మకర్త,ఆలయ పురోహితులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

