Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిడిపి నేత రాజన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి

*టిడిపి నేత రాజన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి*

నారాయణవనం మండలం తుంబూరు టిడిపి నేత రాజన్(56) అనారోగ్యంతో మృతి చెందారు.

 

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం తుంబూరు చేరుకొని రాజన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

 

రాజన్ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అతని కుమారునికి ఎమ్మెల్యే అందించి ఓదార్చారు.

 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్ మృతి పార్టీకి తీరని లోటు అని, అతని కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

 

అనంతరం రాజన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

 

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన..

Garuda Telugu News

నెల్లూరునగరంలో వైసీపీ జెండాను రెపరెపలాడించాలి

Garuda Telugu News

స్వగ్రామం నారావారిపల్లి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు

Garuda Telugu News

Leave a Comment