Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

*పల్నాడు : మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం.*

 

*2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.*

 

*చిలకలూరిపేట పీఎస్‌లో ఐదురోజులపాటు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.*

 

*ఇటీవల పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత పిల్లి కోటి.*

 

*న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన పిల్లి కోటి.*

 

*మాజీ మంత్రి విడదల రజినితోపాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు.*

 

*రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం.*

Related posts

ఉద్రిక్తంగా మారిన సిపిఎం ‘భూ పోరాటం

Garuda Telugu News

గ్రామ మండల అర్బన్ కమిటీల ప్రమాణ స్వీకారం …

Garuda Telugu News

సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి సార్

Garuda Telugu News

Leave a Comment