Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కోడి పందేలపై వింజమూరు ఎస్ ఐ వీర ప్రతాప్ కొరడా

కోడి పందేలపై వింజమూరు ఎస్ ఐ వీర ప్రతాప్ కొరడా

వింజమూరు మండలంలోని తక్కెళ్లపాడు అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందెం స్థావరంపై వింజమూరు ఎస్ ఐ కె వీర ప్రతాప్ కొరడా ఝళిపించారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ స్పష్టమైన ఆదేశాల మేరకు కోడి పందేలపై ప్రత్యేక నిఘా ఉంచిన ఎస్ ఐ వీర ప్రతాప్ తక్కెళ్లపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న కోడి పందెం స్థావరంపై తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 7 మందిని అదుపులోకి తీసుకుని 5 కోళ్లు, 26 వేల 50 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ వీర ప్రతాప్ మాట్లాడుతూ సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలో ఎక్కడైనా సరే కోడి పందేలు,పేకాట, అక్రమ మద్యం విక్రయాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్బడిన పక్షంలో చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం తధ్యమని హెచ్చరించారు.

Related posts

గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు

Garuda Telugu News

గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి

Garuda Telugu News

సత్యవేడు పంచాయతీ పరిధిలో చెత్త బుట్టలు పంపిణీ

Garuda Telugu News

Leave a Comment