Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

*‘ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న

*‘ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్‌.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది*

ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ.. గురువారం లా కమిషన్‌తో కూడా విస్తృత చర్చలు జరిపింది.

 

మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు, సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత నివేదికను రూపొందించి వచ్చే బడ్జెట్‌ సమావేశాలలోపు సమర్పించనుంది. ఈ నివేదికను బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా, రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి.. జేపీసీ సభ్యులకు వివరించారు.

Related posts

ఈ నెల16న శ్రీశైలానికి మోదీ రాక…

Garuda Telugu News

సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి

Garuda Telugu News

స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మరియు ఇస్రో బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు

Garuda Telugu News

Leave a Comment