*విశాఖ : శ్రీసిటీలో 5 యూనిట్లను వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.*

*శ్రీసిటీలో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు.*
*రూ.2,320 కోట్లతో ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టులు.. పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు.*
*ఎంవోయూల కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ భరత్, శ్రీసిటీ ఎండీ రవిసానారెడ్డి, సీఎస్ విజయానంద్.*
*శ్రీసిటీ నుంచే డైకెన్, ఇసుజూ, క్యాడ్బరీ ప్రపంచానికి ఉత్పత్తులు అందిస్తున్నాయి.. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్షిప్కు రావాలి.*
*ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందుకొచ్చాయి.*
*హెల్త్కేర్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మెడికల్ డివైసెస్ కంపెనీలకు అనుమతులు.. రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులిచ్చాం.*
*పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం.. త్వరలోనే శ్రీసిటీ సమీపంలోనే ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మిస్తాం.*
*ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఈ తరహా మోడల్స్ మరిన్ని రావాల్సి ఉంది.. ఒక సంస్థ తయారీ ఉత్పత్తులు మరో సంస్థకు ముడిసరకుగా మారతాయి.*
*2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తాం : సీఎం చంద్రబాబు*
