Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు….

టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు….

రాష్ట్ర డైరెక్టర్లకు జెబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానం…

తిరుపతి, నవంబర్ 14:

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి వాటంతట అవే నామినేటెడ్ పదవులు వరిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జెబి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన తోట వాసుదేవ రాయల్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఎస్విఎం శ్రీధర్ లను శుక్రవారం జేబీ శ్రీనివాస్ కార్యాలయంలో జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేబి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, పార్టీలో కష్టపడి పని చేసే వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో వారిద్దరూ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో టిడిపి నేతలు రాజేష్, రఘురాం, జగదీష్, కాలేషా

జేబీ శ్రీనివాస్ యువత నాయకులు పాల్గొన్నారు.

Related posts

బాధితులకు అండగా ఉండడమే ధ్యేయంగా పనిచేస్తా..

Garuda Telugu News

తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా…

Garuda Telugu News

ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన పథకం పై రైతులకు అవగాహన కల్పిస్తున్న PACS చైర్మన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి.

Garuda Telugu News

Leave a Comment