Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర జ్యోతి విలేకరి రాహుల్ కు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

*ఆంధ్ర జ్యోతి విలేకరి రాహుల్ కు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ*

✍️ *త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్ష*

నాగలాపురం ఆంధ్రజ్యోతి విలేఖరి రాహుల్ రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాగలాపురం మండలంలోని రాహుల్ స్వగ్రామమైన సురటపల్లి పంచాయితీ కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామానికి ఎమ్మెల్యే చేరుకొని ఆంధ్రజ్యోతి విలేకరిని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం పరితపించే విలేఖరి రాహుల్ ప్రమాదవశాత్తు గాయాలు పాలవడం బాధాకరమన్నారు.

రాహుల్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ విలేకరి వృత్తిలో రాణించాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

Related posts

లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం…

Garuda Telugu News

తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

చిత్తూరు గంగా సాగరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం

Garuda Telugu News

Leave a Comment