
రేపు ( 07-02-2025 ) విద్యుత్ అంతరాయం
సత్యవేడు మండలం పరిధిలోని దాసుకుప్పం విద్యుత్ సబ్ స్టేషన్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ రవి ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతు పనుల కారణంగా దాసుకుప్పం నుంచి పేరడం గ్రామాలకు సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
