
*మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా కలెక్టర్ ఆనంద్*.
✍️ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారిని వారి నెల్లూరు నివాసంలో జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
⚡జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి కలెక్టర్ వివరించారు.
⚡రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చెయ్యా లని కోరారు.
⚡జిల్లాలో పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు,పెండింగ్ పనులు ,అమలవుతున్న పథకాలు , సోమశిల ప్రాజెక్టు సంబధిత పనులు, ఆత్మకూరు నియోజక వర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలు చర్చించారు.ప్రధానంగా విద్యా రంగంలో రానున్న నూతన విధానాలపై చర్చించారు
* ఈ సందర్భంగా మంత్రి గారి నివాసం వద్ద సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి జిల్లా కలెక్టర్ గారిని శాలువాతో సన్మానించారు….తేది 5 ఫిబ్రవరి 2025
