Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014  అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు . పట్టణ ప్రాంతాలలో పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ లో ప్రారంభించారు . ఈ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులంతా పలు పట్టణాలలో పాల్గొన్నారు. అనిల్ అంబానీ , సచిన్ టెండూల్కర్ , బాబా రాందేవ్ , కమలహాసన్ మొదలగు అనేక దిగ్గజాలు కార్యక్రమంలో పాల్గొన్నారు . స్వచ్ఛభారత్ దేశంలో 4041 పైగా పట్టణాల్లో అమలు చేశారు . మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలు . దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 14,623 కోట్ల రూపాయలు.ఈ కార్యక్రమాన్ని విశాఖలో నాటి పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు  బిజెపి  వైద్య విభాగం ఆధ్వర్యంలో , ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్  లో ప్రారంభించి , ఐదు సంవత్సరాలలో నగరంలో అనేక స్వచ్ఛభారత కార్యక్రమాలలో పాల్గొని విశాఖ ప్రజలకు , అధికారులకు స్ఫూర్తిని ఇచ్చారు.
విశాఖకు స్వచ్ఛభారత్ స్వచ్ఛతాహి సేవలో 3,6,9 స్థానములు లభించాయి. స్మార్ట్ సిటీగా రూపు దిద్దుతున్న విశాఖలో స్వచ్ఛభారత్ ద్వారా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువైంది . మన ఇల్లు , మన సమాజం పరిశుభ్రత లక్ష్యముగా స్వచ్ఛభారత్  కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం .

Related posts

బిడ్డల విద్యపై… దృష్టి లేని తల్లిదండ్రులు…. సామాన్యుల కు అందని వైద్యం.. ప్రజారోగ్యానికి భరోసా లేదు… వైద్యవిద్య కూడా… రాజకీయమే…

Garuda Telugu News

ఉబ్బలమడుగు లో యువకుడు మృతి 

Garuda Telugu News

“మొంథా” తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పిజిఆర్ఎస్) రద్దు. 

Garuda Telugu News

Leave a Comment